29 మందిని కరిచిన కుక్క !

Telugu Lo Computer
0


చెన్నైలో ఓ కుక్కు గంటల వ్యవధిలో 29 మందిని కుక్క కరిచింది. మంగళవారం రాత్రి జీఏ రోడ్డులో ఓ కుక్క కేవలం రెండు గంటల వ్యవధిలో ఐదుగురు పిల్లలతో పాటు మొత్తం 29 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గాయపడిన వారికి ప్రభుత్వ స్టాన్లీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స అందిచారు. 29 మందిని కరిచిన తర్వాత వీధి కుక్క పై ఆగ్రహంతో స్థానికులు దాన్ని కొట్టి చంపారు. అయితే వెటర్నరీ వైద్యులు కుక్క మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. పోస్ట్ మార్టం రిపోర్టులో సంచనల విషయం బయటకొచ్చింది. 29 మందిని కరిచిన కుక్కకు రేబీస్ ఉందని తేలింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కుక్క దాడిలో గాయపడిన వారికి రేబీస్ వ్యాక్సిన్ ను ఇచ్చారు. బాధితులను అబ్జర్వేషన్ లో ఉంచినట్టు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)