మేళాలో అల్లరి మూకలపై లాఠీఛార్జ్‌ !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌, ఝాన్సీలోని మౌరానీపూర్‌లో జలవిహార్ మహోత్సవ్ జరిగింది. ప్రతి ఏటా నిర్వహించే ఈ కార్యక్రమానికి ఈసారి సుమారు 20 వేల మంది వరకు జనం వచ్చారు. రష్యాకు చెందిన డ్యాన్సర్లు డ్యాన్స్‌ చేస్తుండగా అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ఒకరినొకరు తోసుకుని ముందుకు వచ్చారు. స్టేజీ వద్దకు పలువురు చేరుకున్నారు. స్టేజీ ఎక్కేందుకు కొందరు ప్రయత్నించారు. ఈ మూకను కంట్రోల్‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా లాఠీలు ఝుళిపించారు. కొందరు వ్యక్తులను లాఠీలతో కొట్టి చెదరగొట్టారు. ఈ సందర్భంగా కొందరు గాయపడ్డారు. ఈ గందరగోళం వల్ల డ్యాన్స్ కార్యక్రమం ఆగిపోయింది. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)