దసరా వేడుకలకు ముందు ఢిల్లీలోని ఎర్రకోట మైదానం వద్ద అంతకు ముందు కనిపించిన సనాతన ధర్మ విమర్శకుల దిష్టిబొమ్మలను తొలగించారు. దసరా వేడుకలు ప్రారంభం కాకముందు రావణ దహనం సందర్భంగా ఏర్పాటు చేసిన దిష్టిబొమ్మలపై సనాతన ధర్మ వ్యతిరేకుల లేబుల్స్ను అధికారులు తొలగించారు. దిష్టిబొమ్మల్లో ఒకదానిపై సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వారిని నాశనం చేస్తామని రాసి ఉండగా ఇప్పుడు అలాంటి దిష్టిబొమ్మలను తొలగించారు.ఇక సనాతన ధర్మ విమర్శకుడని రాసి ఉన్న మరో దిష్టిబొమ్మను కూడా తొలగించారు. సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపడంతో దేశవ్యాప్తంగా చర్చకు తెరలేచిన సంగతి తెలిసిందే.
సనాతన ధర్మ విమర్శకుల దిష్టి బొమ్మల తొలగింపు !
October 24, 2023
0
Tags