రావణ దహనం చేసిన తొలి మహిళగా కంగన రికార్డు !

Telugu Lo Computer
0

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ దసరా సందర్భంగా దేశరాజధాని ఢిల్లీ లోని రాంలీలా మైదానంలో నిర్వహించిన 'రావణ్‌ దహన్‌' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ రావణ దహనం చేశారు. 50 ఏళ్ల చరిత్రలో మొదటిసారి ఓ మహిళ ఈ కార్యక్రమానికి వెళ్లి రావణ దహనం చేయడం ఇదే తొలిసారి. దీంతో రావణ దహనం చేసిన తొలి మహిళగా కంగన రికార్డుకెక్కారు. కాగా, రావణ్‌ దహన్‌ కార్యక్రమంలో కంగన సాంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయారు. ఎర్రటి చీర ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. జై శ్రీరామ్‌ అంటూ రావణ, కుంభకర్ణ, మేఘనాథుల ప్రతిమలను దహనం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా తదితరులు హారయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)