అజిత్ పవార్‌కు సీఎం పదవి కలగానే మిగులుతుంది !

Telugu Lo Computer
0


జిత్ పవార్ ఎన్నటికీ మహారాష్ట్ర సీఎం కాలేడని, సీఎం పదవి అతడికి కల గానే మిగిలిపోతుందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. బీజేపీ దేశంలో 70 శాతం రాష్ట్రాల్లో అధికారంలో లేదని, మహారాష్ట్రలోనూ ఆ పార్టీ అధికారం కోల్పోతుందని స్పష్టం చేశారు. పవార్ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో ఇతర పార్టీలను చీల్చి అధికారంలోకి వచ్చిందని, 70 శాతం రాష్ట్రాల్లో కాషాయ పార్టీ అధికారంలో లేదని గుర్తుచేశారు. వంచిత్ బహుజన్ అఘాడి నేత ప్రకాష్ అంబేడ్కర్ విపక్ష ఇండియా కూటమిలో చేరడం సానుకూల పరిణామమని పవార్ పేర్కొన్నారు. 2024 ఎన్నికల అనంతరం మహారాష్ట్రలో శివసేన (యూబీటీ) ఎన్సీపీ (శరద్ పవార్ గ్రూప్‌), కాంగ్రెస్‌తో కూడిన ఎంవీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని శరద్ పవార్ పేర్కొన్నారు. సుప్రియా సూలేను ఎన్పీపీ అధ్యక్షురాలిని చేయాలని గతంలో సూచించిన తన సహచరుడు ఛగన్ భుజ్‌బల్ ఇప్పుడు ఆయనే అజిత్ పవార్ పంచన చేరాడని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)