తెలంగాణలో భాజపా-జనసేన పొత్తు, సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే కిషన్రెడ్డి, లక్ష్మణ్, పవన్ కల్యాణ్ను కలిసి తెలంగాణలో భాజపాకు మద్దతివ్వాలని కోరారు. తెలంగాణలో పోటీ చేయాలని జనసేన కూడా సన్నద్ధమవుతున్న తరుణంల ఇరు పార్టీల మధ్య పొత్తుపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశముంది.
అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ
October 25, 2023
0
Tags