అక్రమ సంసారం ముగ్గుర్ని బలి తీసుకుంది ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday 19 October 2023

అక్రమ సంసారం ముగ్గుర్ని బలి తీసుకుంది !

త్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో 63 ఏళ్ల విమల్‌ 30 ఏళ్ల ఖుష్బుతో సహజీవనం చేస్తున్నాడు. తండ్రి రామ్‌ప్రకాష్‌ ద్వివేది కలిసి అమ్రోదాలో ఉంటున్నాడు. తండ్రి విమల్‌, ఖుష్బుతో సహజీవనం చేయడంపట్ల అతడి ఇద్దరు కుమారులతో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 42 ఏళ్ల లలిత్‌, 18 ఏళ్ల సవతి సోదరుడు అక్షత్ కలిసి గురువారం తెల్లవారుజామున ఆ ఇంటికి చేరుకున్నారు. తండ్రి విమల్‌, సహజీవనం చేస్తున్న ఖుష్బు, తాత రామ్‌ప్రకాష్‌పై కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఖుష్బు, తాత మరణించగా గాయపడిన తండ్రి విమల్‌ ఇంటి నుంచి బయటకు పరుగుతీశాడు. గమనించిన బంధువులు అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ సమాచారం అందుకున్న పోలీసులు లలిత్‌, అక్షత్‌ను అరెస్ట్‌ చేశారు. 30 ఏళ్ల ఖుష్బుతో 63 ఏళ్ల తండ్రి సహజీవనం చేయడం పట్ల ఇద్దరు కుమారులు అసంతృప్తిగా ఉన్నారని, ఈ నేపథ్యంలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

No comments:

Post a Comment