పవన్ కళ్యాణ్‌కు తీవ్రమైన వెన్నునొప్పి !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా, మచిలీపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం వారాహి విజయ యాత్రలో భాగంగా జనసేన ఆధ్వర్యంలో జనవాణి అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లినా క్లియర్ కాని సమస్యలను ప్రజలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువస్తుంటారు. ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి.  ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. కొంతసేపు రెస్ట్ తీసుకున్నా వెన్ను నొప్పి తగ్గకపోవడంతో వెంటనే ఆయన కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. గబ్బర్‌ సింగ్‌ సినిమా షూటింగ్‌ సమయంలో వెన్ను పూసలకు తీవ్ర గాయాలు కావడంతో తరచూ నన్ను వెన్ను నొప్పి బాధిస్తుందని పవన్ కళ్యాణ్ 2019లో ప్రకటించారు. ఆ సమయంలో ఎన్నికలు ఉండడం వలన ప్రచార సమయంలో అశ్రద్ధ చేయడం వల్ల గాయాల నొప్పి తీవ్రత పెరిగిందని ఆయన అప్పట్లో ఒక ప్రకటన రిలీజ్ చేశారు. డాక్టర్లు సర్జరీకి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ సంప్రదాయ వైద్యంపై నమ్మకంతో ఆ దిశగానే ముందుకు వెళుతున్నాను కానీ గత కొన్ని రోజులుగా మళ్ళీ బ్యాక్‌ పెయిన్‌ తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని ఆయన అన్నారు. అప్పట్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను' అని అంటూ ఆ ప్రకటనలో తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)