బీజేపీ ప్రయోగశాల గుజరాత్ కాదు మధ్యప్రదేశ్ !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌లోని షాదోల్‌లో ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ బీజేపీ - ఆర్‌ఎస్‌ఎస్ ప్రయోగశాల గుజరాత్ కాదని, అసలు ప్రయోగశాల మధ్యప్రదేశ్ అంటూ బీజేపీ  వృద్ధ నేత ఎల్‌కె అద్వానీ తాను రాసిన పుస్తకంలో అభివర్ణించారని రాహుల్ గుర్తు చేశారు. ఈ ప్రయోగశాలలో చనిపోయిన వ్యక్తులకు చికిత్స జరుగుతుందని, వారి డబ్బు చోరీ అవుతుందని రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వ్యాపమ్ కుంభకోణం కోటి మంది యువత భవిష్యత్తును నాశనం చేసిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుంభకోణం కారణంగా 40 మంది హతమయ్యారని, ఎంబిబిఎస్ సీట్లు అమ్ముడుపోయాయని, రిజిస్ట్రార్ కావాలంటే రూ. 15 లక్షలు చెల్లిస్తే చాలని ఆయన మధ్యప్రదేశ్‌లోని బీజేపీ  ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వారి అరాచకాలు ఇక్కడితో ఆగబోవని, బీజేపీ  ప్రయోగశాలలో గత 18 ఏళ్లలో 18,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రాహుల్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు కమల్ నాథ్ మాట్లాడుతూ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కేవలం ఒక నాయకుడి భవిష్యత్తుతో ఒక పార్టీ భవిష్యత్తునో నిర్ణయించబోవని చెప్పారు. ఇది రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తానని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణం సమయంలో తాము ప్రజలకు ఉపశమనం కలిగించే అనేక సహాయక చర్యలు చేపట్టామని రాహుల్ తెలిపారు. ప్రతి ఇంట్లో డబ్బును పొదుపు చేసుకునేలా చూడడమే తమ కర్తవ్యమని, ఈ విషయంలో తాము విజయవంతం అయ్యామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)