కేటీఆర్, హరీశ్ రావులతో కేసీఆర్ అత్యవసర భేటీ !

Telugu Lo Computer
0

హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులతో మఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసర భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రచారంపై చర్చిస్తున్నారు. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ పార్టీ పట్టుదలతో ఉంది. ఇప్పటికే ఎన్నికల అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు కొన్ని రోజుల క్రితం వైరల్ ఫీవర్ తో బాధపడిన కేసీఆర్ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ఎన్నికల పర్వంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)