పశ్చిమ బెంగాల్ లో శరన్నవరాత్రి సందర్భంగా దుర్గా పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే ఉత్సవాలను చూడటానికి దేశం నుంచే కాకుండా, ప్రపంచ దేశాల నుంచి కూడా ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా పొరుగు దేశం నుంచి ప్రేమ వ్యవహరాలకు సంబంధించి యువతీ యువకులు, ఒక దేశం నుంచి మరోక దేశానికి అక్రమంగా చొరబడుతున్నారు. ఈ క్రమంలో సదరు బంగ్లాదేశీయులు మన దేశంలోని కోల్ కతాకు రావడం వార్తలలో నిలిచింది.. బంగ్లా దేశీయులు మన దేశంలో చెల్లుబాటు అయ్యే పాస్ పోర్ట్ లతో వచ్చారు. అంతేకాక ఇక్కడ జరుగుతున్న దుర్గాపూజలు, గార్భా డ్యాన్స్ లను ఆనందగా చూశారు. ప్రస్తుతం మన దేశం ఆచారాలు, సంప్రదాయాలను చూడటానికి విదేశీయులు సైతం ఎంతో ఆసక్తికనబరుస్తున్నారు. మన దేశానికి వచ్చినప్పుడు ఇక్కడ వారిలాగా చీరకట్టు, ధోతీలు ధరించి అందరికి ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. పూజలలో భక్తితో పాల్గొంటున్నారు.
శరన్నవరాత్రి ఉత్సవాల్లో బంగ్లా దేశీయులు !
October 21, 2023
0
Tags