స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండుగ సీజన్లో కొత్తగా కారు కనాలనుకునే కస్టమర్ల లోన్లపై తాజా ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. ఈ ఆఫర్ 2024, జనవరి 31 వరకు అందుబాటులో ఉంటుంది. అంతేకాదు హోమ్లోన్లపై అందిస్తున్న రాయితీని పొడిగించింది. గరిష్టంగా 65 బేసిస్ పాయింట్ల తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇపుడు ఆఫర్నురానున్న ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో పొడిగించింది. డిసెంబరు 2023 దాకా తగ్గింపు వడ్డీరేట్లు వర్తిస్తాయిని బ్యాంకు వెల్లడించింది. సంవత్సరానికి ఆటో రుణంపై బ్యాంకు MCLR రేటు 8.55 శాతం. గ్రీన్ కార్ లోన్ (ఎలక్ట్రిక్ వెహికల్) 9.65 శాతం నుండి 9.35 శాతం వడ్డీ వసూలు చేస్తుంది. కస్టమరల క్రెడిట్ స్కోర్లు , విభిన్న కాలవ్యవధుల ప్రకారం వివిధ కార్ లోన్ రేట్లు నిర్ధారిస్తుంది. అతి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందిస్తున్నామని బ్యాంకు పేర్కొంది. కారు లోన్ కోసం గరిష్ట కాలవ్యవధి 7 సంవత్సరాలు. కారు ఆన్-రోడ్ ధరమొత్తంలో 90 శాతం వరకు రుణం ఇవ్వవచ్చు.ఈ లోన్ ద్వారా కొత్త ప్యాసింజర్ కారు, మల్టీ యుటిలిటీ వెహికల్ , SUVని కొనుగోలు చేయవచ్చు. కస్టమర్ ప్రీపేమెంట్ చేయాలనుకుంటే, ఎలాంటి ముందస్తు చెల్లింపు ఛార్జీ తీసుకోబడదు. అలాగే ఏడాది తరువాత త కస్టమర్పై ఎలాంటి ఫోర్క్లోజర్ ఛార్జీ ఉండదు. కారు రుణాలపై పరిమిత కాల వ్యవధిలో అందిస్తున్న ప్రాసెసింగ్ ఫీజు ఆఫర్ పొందాలంటే కొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్, రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు, రెసిడెన్షియల్ ప్రూఫ్, ఫారం 16, ఐడీ కార్డు (పాన్ ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్) లాంటివి ఇవ్వవచ్చు.
ఎస్బీఐ హోంలోన్ ఆఫర్ పొడిగింపు
September 27, 2023
0
Tags