భారత్ జోడో యాత్ర రెండో షెడ్యూల్ ప్రకటన

Telugu Lo Computer
0


కాంగ్రెస్ నేత రాహుల్ నాయకత్వంలో కొనసాగే భారత్ జోడో యాత్రం రెండో దశకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రకటించింది. రేపు ప్రారంభం కానున్న ఈ యాత్ర వచ్చే ఏడాది జనవరి 30 వరకు సాగుతుందని ఆ పార్టీ పేర్కొంది. దీనికి సంబంధించిన వివరాలకు కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. మొత్తం 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 4,081 కిలోమీటర్ల పాటు యాత్రం సాగుతుందని పేర్కొన్నారు. ఈ విషయమై కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పటోలే మాట్లాడుతూ.. "రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండవ దశ గుజరాత్ నుంచి మేఘాలయ వరకు ఉంటుంది. పశ్చిమ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రముఖ కాంగ్రెస్ నేతలు పాదయాత్రలకు నాయకత్వం వహిస్తారు'' అని తెలిపారు. తొలి విడత యాత్రలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దాదాపు 4,000 కిలోమీటర్లు నడిచింది. అయితే ఇది ముగిసిన చాలా రోజులకు రాహుల్ యాత్ర ప్రారంభించారు. గుజరాత్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ వరకు సాగనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక రాహుల్ భారత్ జోడో యాత్రకు అనుగుణంగా మహారాష్ట్రలోని పార్టీ నేతలు సమాంతర పాదయాత్ర నిర్వహిస్తారని ఆయన చెప్పారు. భారత్ జోడో యాత్ర గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేసి 130 రోజుల పాటు కొనసాగిన యాత్ర జనవరి 30న శ్రీనగర్‌లో ముగిసింది. అయితే రెండవ యాత్రకు సంబంధించిన తేదీలు సహా పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. పాదయాత్ర అనంతరం మహారాష్ట్ర అంతటా బస్సు ప్రయాణం ప్రారంభిస్తామని పటోలే తెలిపారు. ఈ యాత్రలో ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. సభలతో పాటు ప్రజలతో మాట్లాడనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)