18 నుంచి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల అజెండాను విడుదల చేసింది. ఈనెల 18న ప్రారంభమయ్యే తొలి రోజు సమావేశాల్లో 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రయాణంపై చర్చించనున్నట్టు లోక్సభ, రాజ్యసభ సచివాలయాలు వేర్వేరుగా బులెటిన్లు విడుదల చేశాయి. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి, ఎన్నికల కమిషనర్ల నియామకాలను నియంత్రించేలా కేంద్రప్రభుత్వం కొత్త బిల్లును ఆగస్టు 10న రాజ్యసభలో ప్రవేశపెట్టింది. నియామక ప్యానెల్లో ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత, ప్రధాని నామినేట్ చేసిన కేంద్ర కేబినెట్ మంత్రి ఒకరు సభ్యులుగా ఉంటారని బిల్లులో పేర్కొన్నారు. కమిటీ నుంచి సీజేఐను తొలగించనున్నట్లు చెప్పడంతో ఈ నియామక ప్రక్రియ వివాదాస్పదమైంది. ఆ బిల్లుతో కలిపి నాలుగు ముఖ్యమైన బిల్లులను ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అడ్వొకేట్స్ (సవరణ) బిల్లు, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లుల గురించి చర్చిస్తారని సమాచారం. వీటిని ఆగస్టు 3న రాజ్యసభలో ఆమోదించారు. మరోవైపు పోస్టాఫీసు బిల్లు-2023పై చర్చకు రాజ్యసభ ఎంపీలు సన్నద్ధమయ్యారు. ఉమ్మడి పౌరస్మృతిపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 18న పాత భవనంలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 19 నుంచి నూతన పార్లమెంట్ భవనంలో సమావేశాలు కొనసాగుతాయి.
Post Top Ad
adg
Thursday, 14 September 2023
Home
National
ప్రత్యేక సమావేశాల అజెండా విడుదల
రాజ్యసభ సచివాలయాలు వేర్వేరుగా బులెటిన్లు విడుదల
లోక్సభ
ప్రత్యేక సమావేశాల అజెండా విడుదల !
ప్రత్యేక సమావేశాల అజెండా విడుదల !
Tags
# National
# ప్రత్యేక సమావేశాల అజెండా విడుదల
# రాజ్యసభ సచివాలయాలు వేర్వేరుగా బులెటిన్లు విడుదల
# లోక్సభ
About Telugu Lo Computer
లోక్సభ
Tags
National,
ప్రత్యేక సమావేశాల అజెండా విడుదల,
రాజ్యసభ సచివాలయాలు వేర్వేరుగా బులెటిన్లు విడుదల,
లోక్సభ
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment