మేఘాలయాలో బీజేపీకి గుడ్‌ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 8 September 2023

మేఘాలయాలో బీజేపీకి గుడ్‌ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే


మేఘాలయాలో బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే హిమాలయా ఎం షాంగ్లియాంగ్‌ బీజేపీకి రాజీనామా చేసి అధికార నేషనల్‌ పీపుల్స్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన.. సెప్టెంబర్‌ 13న నేషనల్‌ పీపుల్స్‌ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మీరు షిల్లాంగ్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారా..? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తాను ఎలాంటి షరతులు విధించకుండా నేషనల్‌ పీపుల్స్‌ పార్టీలో చేరుతున్నానని చెప్పారు. పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీ సభ్యుడిగా అధిష్ఠానం ఏ బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యతలను నిర్వహిస్తానని తెలిపారు. రాష్ట్రంలో సీఎం కాన్రాడ్‌ సంగ్మా చేసిన అభివృద్ధి పనులను చూసే తాను నేషనల్‌ పీపుల్స్‌ పార్టీలో  చేరాలని నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు.

No comments:

Post a Comment