హర్ ఘర్ తిరంగా పేరుతో కార్యక్రమంలో భాగంగా అమిత్ షా తన ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేశారు. విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి అమిత్ షా నివాళులు అర్పించారు. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించడం చరిత్రలోనే చీకటి అధ్యాయమని ఆయన అన్నారు. ఇందుకు మన దేశం ఎంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. 1947 నాటి భయనక అనుభవాలు ఎంతోమందిని వెంటాడుతూనే ఉన్నాయన్నారు. మతప్రాతిపదికన దేశ విభజన సమయంలో లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారని, కోట్లాదిమంది నిర్వాసితులుగా మారారన్నారు. విభజన కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి అగస్ట్ 14న 'విభజన గాయాల సంస్మరణ దినాన్ని' పురస్కరించుకొని నివాళులర్పిస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయినవారిని గుర్తు చేసుకునే సందర్భమని ప్రధాని మోడీ అన్నారు.
ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అమిత్ షా !
August 14, 2023
0
Tags