పిల్లి చేసిన పనికి కొట్టుకున్న రెండు కుటుంబాలు !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లో పెంపుడు పిల్లి కారణంగా రెండు కుటుంబాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నాయి. ఓ కుటుంబం పిల్లిని పెంచుకుంటోంది. అయితే, ఆ పిల్లి తమ ఇంట్లోకి దూరుతోందని, గలీజ్ చేస్తోందని పక్కింటి వాళ్లు పిల్లి యజమానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. వ్యవహారం కొట్టుకునే వరకు వెళ్లింది. పక్కింటి వ్యక్తి గడ్డపారతో పిల్లి పెంచుతున్న మహిళపై దాడి చేశాడు. ఆమెను కిందపడేసి తీవ్రంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ మహిళ నేలపై పడిపోయి ఉంది. ఓ వ్యక్తి గడ్డపారతో ఆమెపై దాడి చేయడం వీడియోలో ఉంది. ఈ గొడవలో ఓ మహిళ దుస్తులు కూడా చిరిగిపోయాయి. ఈ ఘటనతో స్థానికులు షాక్ కి గురయ్యారు. పిల్లి ఎంత పని చేసింది అని తల పట్టుకున్నారు. పిల్లి చేసిన పనికి రెండు కుటుంబాలు ఇలా దారుణంగా కొట్టుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. వీళ్లేం మనుషులురా నాయనా అని విస్తుపోతున్నారు. దీనిపై పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)