భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు చేర్పులు చేయలేదని చెప్పారు. ఏడు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులు మార్చినట్లు వివరించారు. కోరుట్ల, ఉప్పల్, వేములవాడ, బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరాలో సిట్టింగ్లు మారుస్తున్నట్లు వివరించారు. క్రమంలోనే నాలుగు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన నిలిపివేశామని పేర్కొన్నారు. ఇందులో నర్సాపూర్, నాంపల్లి , జనగామ, గోషామహల్ స్థానాలు ఉన్నాయని వెల్లడించారు.మరోవైపు కామారెడ్డి, గజ్వేల్ నుంచి తాను పోటీ చేయనున్నట్లు కేసీఆర్ తెలియజేశారు.
గజ్వేల్, కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ
August 21, 2023
0
Tags