ముగిసిన అమర్‌నాథ్ యాత్ర ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 31 August 2023

ముగిసిన అమర్‌నాథ్ యాత్ర !


రెండు నెలలపాటు సాగిన అమర్‌నాథ్ యాత్ర ముగిసింది. ఈ ఏడాది 4.4 లక్షల మంది భక్తులు మంచుకొండల్లో ఉండే శివలింగాన్ని దర్శించుకున్నారు. 62 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో 48 మంది మరణించారని, 62 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. వాతావరణ సంబంధిత, సాధారణ కారణాలతో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. గతేడాది 3.65లక్షల మంది అమర్‌నాథ్‌ శివలింగాన్ని దర్శించుకోగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 4.4లక్షలకు చేరుకోవడం గమనార్హం. ఈ ఏడాది యాత్ర శాంతియుతంగా, ఎలాంటి ఆంటకాలు లేకుండా సాగిందని అధికారులు తెలిపారు. మహంత్‌ దీపేంద్ర గిరి నేతృత్వంలో సాధువులు, యాత్రికులు పెహల్గామ్‌ నుంచి 42కి.మీ దూరం నడిచి అమర్‌నాథ్‌కు చేరుకున్నారు. అనంతరం చివరి రోజు (గురువారం) ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

No comments:

Post a Comment