కాకినాడ రైల్వే స్టేషన్‌లో వైద్య విద్యార్థిని దుర్మరణం - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 11 August 2023

కాకినాడ రైల్వే స్టేషన్‌లో వైద్య విద్యార్థిని దుర్మరణం


కాకినాడ రైల్వే స్టేషన్ లో ప్రమాదవశాత్తూ రైలు పట్టాలపై పడి వైద్య విద్యార్థిని దుర్మరణం పాలైంది. కాకినాడ జీఆర్‌పీ ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం విజయవాడకు చెందిన ఎస్‌.సత్య తనూష(24) గుంటూరు జిల్లా చినకాకాని ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతోంది. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఈనెల 10 నుంచి మూడు రోజుల పాటు సదస్సు ఉండటంతో పాల్గొనేందుకు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో కాకినాడ చేరుకుంది. రెండో నంబరు ప్లాట్‌ఫాం వద్ద రైలు దిగేందు సిద్ధమవుతుండగా పట్టు తప్పి పట్టాలపై పడిపోయింది. రైలు పోర్టు రైల్వేస్టేషన్‌ వైపు నెమ్మదిగా కదలడంతో వెంటనే అప్రమత్తమైన స్నేహితులు, ప్రయాణికులు గట్టిగా కేకలు వేసి చైన్‌లాగారు. వెంటనే రైలు ఆగినప్పటికీ.. అప్పటికే ప్లాట్‌ఫాం, రైలు చక్రాల మధ్య నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందింది.

No comments:

Post a Comment