జయప్రదకు జైలు శిక్ష విధించిన ఎగ్మోర్‌ కోర్టు !

Telugu Lo Computer
0


మిళనాడులోని ఎగ్మోర్‌ కోర్టు జయప్రదకు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. చెన్నైకి చెందిన రామ్‌ కుమార్‌, రాజబాబుతో కలిసి జయప్రద అన్నారోడ్డులో ఓ సినిమా థియేటర్‌ను నడిపించారు. కాగా, ఈ సినిమా థియేటర్‌లో పనిచేసే కార్మికులు నుంచి వసూలు చేసిన ఈఎస్‌ఐ మొత్తాన్ని చెల్లించలేదని కార్మిక బీమా కార్పోరేషన్‌ కోర్టులో పిటిషన్‌ వేసింది. దీనిపై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. అయితే, దీనిపై విచారణ జరిపిన కోర్టు జయప్రదతో పాటుగా మరో ముగ్గురికి ఎగ్మోర్ కోర్టు ఆర్నెళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. అలాగే, ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)