ఢిల్లీలోని గీతా కాలనీలో స్కూటర్పై వెళుతున్న తల్లీకొడుకుపై ఎద్దు దాడి చేసింది. ఈ దాడిలో బాధితులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సమీప సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫుటేజ్లో స్కూటర్పై వెళుతున్న తల్లీకొడుకుపైకి దూసుకొచ్చిన ఎద్దు విచక్షణా రహితంగా వారిపై దాడి చేసింది. అటుగా వెళుతున్న పాదచారులు వారిని కాపాడేందుకు పరుగున వెళ్లడం ఈ వీడియోలో చూడొచ్చు. ఎద్దు దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఎద్దును తరిమేందుకు స్ధానికులు ప్రయత్నించగా అసహనానికి లోనైన ఎద్దు వారిపైనా దాడి చేసేందుకు ప్రయత్నించింది. https://t.me/offerbazaramzon
స్కూటర్పై వెళుతున్న తల్లీకొడుకుపై ఎద్దు దాడి !
July 23, 2023
0
Tags