దేశంలో అతి పెద్దదైన ఢిల్లీ లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా నిర్మించిన ఎలివేటెడ్ ఈస్ట్రన్ క్రాస్ టాక్సీవే లతోపాటు నాలుగో రన్ వేను పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం ప్రారంభించారు. కొత్తగా ఈసీటీ అందుబాటులోకి రావడంతో కింది నుంచి రోడ్డు మార్గం, పైనుంచి వంతెన తరహా టాక్సీవే కలిగి ఉన్న దేశంలోని ఏకైక విమానాశ్రయంగా ఐజీఐఏ అవతరించింది. విమానాశ్రయంలోని టర్మినళ్లు, హ్యాంగర్లను రన్వేలతో అనుసంధానించే ప్రత్యేక మార్గాలే ఈ టాక్సీవేలు. ఈసీటీ పొడవు 2.1 కి.మీలు ఉంది. ఇది దిల్లీ విమానాశ్రయంలోని ఉత్తర, దక్షిణ ఎయిర్ఫీల్డ్లను అనుసంధానిస్తుంది. మూడో రన్వే నుంచి టర్మినల్-1కి మధ్య దూరాన్ని ఏడు కిలోమీటర్ల మేర తగ్గిస్తుంది. ఏ-380, బీ-777, బీ-747 సహా వైడ్-బాడీ విమానాలు దీనిపైనుంచి రాకపోకలు సాగించవచ్చు. ఇప్పటికే దిల్లీ ఎయిర్పోర్టుకు రోజూ 1500కుపైగా విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మున్ముందు మరింత రద్దీని తట్టుకునేలా.. ప్రయాణికుల సమయం ఆదా చేసేలా సౌకర్యాల కల్పనలో భాగంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. https://t.me/offerbazaramzon
ఢిల్లీ విమానాశ్రయంలో మొదటి ఎలివేటెడ్ ట్యాక్సీవే !
July 14, 2023
0
Tags