న్యూ ఢిల్లీలోని ప్రధానమంత్రి మోడీ నివాసంపై డ్రోన్ కెమెరా సంచారం కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో మోడి ఇంటిపై ఓ డ్రోన్ కనిపించడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే డ్రోన్ సంచారాన్ని గుర్తించినట్టు ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) నుంచి ఢిల్లీ పోలీసులకు సమాచారమిచ్చారు. ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారిక నివాసం ఉంది. అది నో-ఫ్లై జోన్లో ఉంటుంది. అలాంటి ప్రాంతంలోకి డ్రోన్ రావడం కలకలం రేపింది. డ్రోన్ సంచరించేటప్పుడు ప్రధాని మోడీ ఇంట్లోనే ఉన్నారని భద్రతా సిబ్బంది తెలిపారు. డ్రోన్ సమాచారం అందిన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ పోలీసులతో కలిసి ఆ డ్రోన్ను కనిపెట్టేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటివరకు అనుమానాస్పదంగా ఏదీ కనిపించలేదని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రధాని నివాసానికి పరిసర ప్రాంతాలన్నీ జల్లెడపట్టినట్టు ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ను కూడా సంప్రదించామని, ప్రధాని నివాసం వద్ద ఎలాంటి ఎగిరే పరికరాలను గుర్తించలేదని వారు చెప్పారని వివరించారు. https://t.me/offerbazaramzon
ప్రధాన నివాసంపై డ్రోన్ కలకలం
July 03, 2023
0
Tags