భార్యను హత్య చేసి సన్యాసిగా మారాడు !

Telugu Lo Computer
0


మిళనాడు చెన్నైలోని ఓట్టేరి ఏకాంకిపురంలో రమేష్, వాణి దంపతులు నివసించేవారు. వీరిది ప్రేమ వివాహం. వీరికి గౌతమ్, హరీష్ అనే ఇద్దరు పిల్లలున్నారు. అయితే రెండేళ్ల క్రితం భార్య భర్తల మధ్య గొడవలు జరిగాయి. ఆ సమయంలో రమేష్ భార్య వాణిని హత్య చేసి పరారయ్యాడు. రమేష్ కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. అయితే దొరకలేదు. పరారైన రమేష్  జట్టు, గడ్డం పెంచి, సన్యాసిలా మారిపోయాడు. కాషాయ వస్త్రం ధరించి తిరుమణ్ణామలై, వడలూరు, చదురగిరి ప్రాంతాల్లో భిక్షమెత్తుతూ జీవించాడు. రెండేళ్లు హాయిగా కాలం సాగించాడు. అయితే రమేష్ ..తన సంపాదనను మరో సన్యాసి సెల్ ఫోన్ ద్వారా ఇద్దరు కుమారులకు పంపేందుకు ఓట్టేరిలోని తన స్నేహితుడికి సెండ్ చేశాడు. ఫోన్ పే యాప్ ద్వారా ఈ ట్రాన్సాక్షన్ చేశాడు. ఆ డబ్బును తన కుమారులకు అందజేయమని చెప్పాడు. రమేష్ పై నిఘా పెట్టిన పోలీసులు.. ఈ ఫోన్ పే చెల్లింపు గురించి తెలిసింది. ఆ తర్వాత రమేష్ ఢిల్లీలోని ఆశ్రమానికి వెళ్లనున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ మేరకు పోలీసులు సెంట్రల్ స్టేషన్ వద్ద నిఘా వేశారు. రమేష్ పాత ఫొటోను పట్టుకుని స్టేషన్ వద్ద కాపలా కాశారు. శనివారం వేకువజామున రమేష్ సన్యాసి వేషంలో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు రావడాన్ని చూశారు. వెంటనే అతడ్ని అరెస్టు చేశారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)