మణిపూర్ ఘటన పై సుప్రీంకోర్టు కన్నెర్ర !

Telugu Lo Computer
0

                                                

ణిపూర్ లో మహిళలను నగ్న ఊరేగింపుగా తీసుకెళ్తున్న వీడియోను చూసి సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఈ విషయంలో తీసుకున్న చర్యలను సుప్రీంకోర్టుకు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి, మణిపూర్ ప్రభుత్వానికి ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇది రాజ్యాంగ వైఫల్యమని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోనట్లయితే, జూలై 28న కోర్టు ఈ కేసు విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం వార్నింగ్ ఇచ్చింది. ఇక నిందితులను చట్టం ముందు నిలబెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది. ఈ దశలో ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించాలని విపక్షాలు తీవ్ర స్థాయిలో డిమాండ్ చేస్తున్నాయి.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)