ముగ్గురు యువకులు కత్తులతో హల్చల్ చేశారు. శనివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. హైదరాబాద్ లోని మల్లేపల్లి బడీ మసీదు సమీపంలో సిద్దీఖీ బీన్ ఓమర్ (42) 'సమ్మర్ ల్యాండ్ జ్యూస్ సెంటర్' నిర్వహిస్తున్నాడు. దుకాణ విషయంలో సోదరుడు అస్లం బీన్ ఓమర్తో కొంతకాలంగా గొడవలు జరగుతున్నాయి. తండ్రి నుంచి తనకు సంక్రమించిన దుకాణం (మడిగె)ను అస్లం బీన్ ఒమర్ కొందరికి విక్రయించాడు. దీంతో మనస్పర్థలు మరింత పెరగడంతో నెల క్రితం ఇద్దరు సోదరులు పరస్పరం ఫిర్యాదు చేశారని హబీబ్నగర్ ఇన్స్పెక్టర్ శ్రీరాం సైదాబాబు తెలిపారు. సివిల్ కేస్ కావడంతో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. శనివారం అర్ధరాత్రి రెండు బైకులపై నలుగురు వ్యక్తులు వచ్చారు. తల్వార్, కత్తులు తిప్పుతూ సిద్దీఖీ బీన్ ఒమర్ను బెదిరించారు. జ్యూస్సెంటర్ అద్దాలు పగులగొట్టి, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ప్రాణాలు తీస్తామంటూ బెదిరించి వెళ్లిపోయారు. దుండగుల నుంచి తప్పించుకున్న బాధితులు ఠాణాకు వెళ్లారు. అదే సమయంలో మడిగెను కొనుగోలు చేసిన హాజీ, వసీం అక్కడే ఉండడంతో బాధితుడు ఉలికిపాటుకు గురయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసి ఎస్సై భాను ప్రకాష్ దర్యాప్తు చేస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందని బాధితుడు సిద్దీఖీ బిన్ ఓమర్ ఆందోళన వ్యక్తం చేశారు. దాడికి ముందు అరంగంట ముందు నుంచే హాజీ, వసీంలు పీఎస్లోనే ఉండడం ఆందోళన కలిగిస్తోందని బాధితుడు వాపోయాడు. https://t.me/offerbazaramzon
అర్ధరాత్రి కత్తులతో వీరంగం !
July 17, 2023
0
Tags