హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే గురువారం రాత్రి మండి జిల్లాలోని సుందర్ నగర్ – కర్సోగ్ రహదారిపై ఖుషాలా సమీపంలో ఓ వాహనం లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు సుందర్ నగర్ కు చెందిన లాలా రామ్ (50), రూప్ లాల్ (55), సునీల్ కుమార్ (35), గోబింద్ రామ్ (60), మోహ్నా (55)గా గుర్తించారు. వీరంతా కమ్రునాగ్ ఆలయాన్ని సందర్శించి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. https://t.me/offerbazaramzon
వాహనం లోయలో పడి ఐదుగురు దుర్మరణం
July 14, 2023
0
Tags