దేశవ్యాప్తంగా 25 వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చిన రైల్వే శాఖ, మరో 4 రైళ్లు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. జులై నెలాఖరులోనే వీటిని ప్రారంభించాలని చూస్తోంది. ఈ నాలుగు రైళ్లూ ఎనిమిదేసి కోచ్లతో నడవనున్నాయి. ఇందులో ఏడు ఛైర్ కార్లు, ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్లు ఉండనున్నాయి.ఈ నెలలో ప్రారంభించనున్న రూట్లలో ఢిల్లీ- చండీగఢ్, చెన్నై- తిరునల్వేలి, లఖ్నవూ- ప్రయాగ్రాజ్, గ్వాలియర్- భోపాల్ ఉండనున్నాయి. ఎనిమిదేసి కోచ్లు అంటే 556 మంది ప్రయాణించడానికి వీలుంటుంది. ప్రస్తుతం 25 రైళ్లు నడుస్తుండగా.. అందులో తొమ్మిది రైళ్లు ఎనిమిదేసి కోచ్లతోనే నడుస్తున్నాయి. కొత్త రైళ్లు కలిపితే మొత్తం వందే భారత్ రైళ్ల సంఖ్య 29కి చేరనుంది.త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్లో గ్వాలియర్- భోపాల్ మధ్య వందే భారత్ రైలును తీసుకురావాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు తెలిసింది.వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నా కొన్ని రూట్లలో వాటికి ఆశించినంత డిమాండ్ ఉండడం లేదు. దీంతో కెపాసిటీ పెంచుకునేందుకు టికెట్ ధరలు తగ్గించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. https://t.me/offerbazaramzon
జులైలో మరో నాలుగు వందే భారత్ రైళ్లు !
July 12, 2023
0
Tags