ఢిల్లీ రోడ్లన్నీ బురదమయం !

Telugu Lo Computer
0


ఢిల్లీ ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. యుమునా నదిలో నీటిమట్టం క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఉదయం 6 గంటల వరకు నీటిమట్టం 206.14 మీటర్లకు చేరింది. నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టినా.. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రోడ్లపైకి చేరిన వరదను పంపుల సాయంతో తోడేస్తున్నారు. నిన్న రాత్రి మరోసారి భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో మళ్లీ భారీ స్థాయిలో వరద నీరు నిలిచింది. కాగా.. ఢిల్లీలో మరో నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. యమునా నది గత 40 ఏండ్లలో తొలిసారిగా డేంజర్ మార్కు అయిన 208 మీటర్లను దాటి ప్రవహించింది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)