పేరులో 'ఇండియా' ఉంటే సరిపోదు !

Telugu Lo Computer
0


ప్రతిపక్ష ఎంపీలు తమ నిరసనలతో పార్లమెంట్ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ దిశాదశ లేకుండా వారు ముందుకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. మంగళవారం నిర్వహించిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 'ఇలా ఒక లక్ష్యం లేకుండా ముందుకెళ్లే విపక్షాలను నేను ఇంతవరకు చూడలేదు. అవి అధికారంలోకి రావాలనుకోవడం లేదు. ఎప్పటికీ విపక్షంలోనే ఉండాలని అవి నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. పేరులో ఇండియా ఉంటే సరిపోదు. వారు దేశ ప్రజలను తప్పుదోవపట్టించేందుకు ఆ పదాన్ని ఉపయోగించారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్ వంటి వాటి పేర్లలో కూడా ఇండియా ఉంది' అంటూ వాటిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నాయి. ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ కార్యకలాపాలు ఒక్కరోజు కూడా సజావుగా సాగలేదు. మణిపుర్‌ లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం, ఇటీవల అక్కడ వెలుగులోకి వచ్చిన వీడియో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. దాంతో ఉభయసభల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అలసిపోయి, నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ కూటమికి సింగిల్ పాయింట్ అజెండా.. మోదీని వ్యతిరేకించడమేనని పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా విజయంపై ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మోడీ వ్యాఖ్యలపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పందించారు. 'రూల్ 267 కింద చర్చ జరపాలని పలువురు సభ్యులు నోటీసులు ఇచ్చారు. మేము మణిపూర్ అంశంపై మాట్లాడుతుంటే, ప్రధాని మాత్రం ఈస్ట్‌ ఇండియా అంటున్నారు' అంటూ మోడీ  వ్యాఖ్యలకు ఖర్గే బదులిచ్చారు. మరోపక్క రాజ్యసభ సభాపక్ష నేత పీయూష్ గోయల్ మాట్లాడుతూ 'హోం మంత్రి అమిత్‌ షా మణిపూర్ అంశంపై మాట్లాడతారు. అలాగే మేం రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, పశ్చిమ్ బెంగాల్‌, మణిపుర్‌లో మహిళలపై జరుగుతోన్న అకృత్యాలపై కూడా చర్చించాలని భావిస్తున్నాం' అని గోయల్‌ అన్నారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)