కొడుకు మరణ వార్త తట్టుకోలేక తల్లి గుండె ఆగింది ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 29 July 2023

కొడుకు మరణ వార్త తట్టుకోలేక తల్లి గుండె ఆగింది !


పంజాబ్‌కు చెందిన గుర్‌విందర్ నాథ్(24) చదువు కోసం కెనడా వెళ్లాడు. ఒంటారియో ప్రావిన్స్‌లో పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. జూలై 9న కొందరు దుండగులు అతనిపై దాడి చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జులై 14న అక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ‍్యులు ఈ విషయాన్ని గుర్‌విందర్ తల్లి నరీందర్ కౌర్‌కు చెప్పలేదు. గుర్‌విందర్ మృతదేహం శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిందనే విషయం అతని తల్లికి ఎట్టకేలకు తెలిసింది. కుమారుని మరణ వార్త విన్న ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. దుఖిస్తూ కళ్లు తిరిగి పడిపోయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత ఆమెను లూథియానాలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాడు. తల్లి, కొడుకుకు ఒకేసారి శుక్రవారం ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు జరిపారు.  https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment