కోచింగ్ సెంటర్ భవనంలో అగ్నిప్రమాదం

Telugu Lo Computer
0


న్యూఢిల్లీ లోని ముఖర్జీ నగర్ ప్రాంతంలోని ఓ కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరగడంతో మంటలు వ్యాపించాయి. ప్రాణాలతో బయటపడేందుకు కోచింగ్ సెంటర్ బిల్డింగ్ కిటికీల నుంచి విద్యార్ధులు తాడు సాయంతో కిందికి దూకారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్ధులు గాయపడ్డారు. ఘటనా ప్రాంతానికి 11 అగ్నిమాపక యంత్రాలు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నాయని అధికారులు తెలిపారు. కోచింగ్ సెంటర్ నుంచి విద్యార్ధులను బయటకు రప్పించామని ఢిల్లీ ఫైర్ సేఫ్టీ చీఫ్ వెల్లడించారు. కాగా, అగ్నిప్రమాదానికి కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఘటనా స్ధలంలో సహాయ కార్యక్రమాలను అధికారులు వేగవంతం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)