ఉత్తరప్రదేశ్లోని మెయిన్ పురి జిల్లాలో ఎనిమిదేళ్ల బాలుడు గత జన్మ తాలూకా ఆనవాళ్లు చెబుతూ కలకలం రేపాడు. అయితే ఇక్కడ ఈ బాలుడు ఆ ఇంట్లో చనిపోయిన ఓ వ్యక్తి పునర్జన్మగా పేర్కొనడం విశేషం. తన అమ్మమ్మను గత జన్మలో తన భార్య అంటూ ఇంట్లో అందరినీ కంగారు పెట్టిస్తున్నాడు. అయితే మొదట అతడి మాటలు కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు. తన పుట్టక ముందు జరిగిన కొన్ని సంఘటనలు చెబుతుంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విచిత్రమైన పునర్జన్మ ఉదంతం ఇలావు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగల్పూర్ గ్రామంలో జరిగింది. ఈ నెల 15న ఎనిమిదేళ్ల ఆర్యన్ దూబే తన తల్లి రంజనతో కలిసి నానిహాల్ రతన్పూర్కు వచ్చాడు. తన పుట్టింటికి వచ్చిన తర్వాత అమ్మమ్మ పాదాలకు నమస్కరించమని ఆర్యన్కు తల్లి చెప్పింది. వెంటనే మండిపడ్డ ఆర్యన్. ఆమె తన అమ్మమ్మ కాదని, తన భార్య అంటూ మాట్లాడాడు. అదే సమయంలో తన మేనమామలను.. తన కొడుకులుగా పేర్కొన్నాడు. తొలుత ఫన్నీగా మాట్లాడుతున్నాడులే అనుకున్నారు కానీ గతంలో జరిగిన సంఘటనలు గురించి చెప్పాడు. తన పేరు మనోజ్ మిశ్రా అని 2015లో పొలానికి వెళ్లిన తాను ఓ గోతిలో నీరు నిండి ఉండటం చూసి, తన కాలితో ఆ గొయ్యిని పూడ్చే ప్రయత్నం చేస్తుండగా.. పాము కాటేసిందని చెప్పాడు. అపస్మారక స్థితిలో వెళ్లిపోయిన తనను ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయానంటూ తెలిపాడు. అలాగే ఆ సమయంలో తన కుమార్తె రంజన గర్భవతిగా ఉందని కూడా పేర్కొన్నాడు. కేవలం తన అమ్మమ్మ నీరజ్ మిశ్రాకు మాత్రమే తెలిసిన విషయాలు చెప్పాడని, అతడి మేనమామ అజయ్ చెప్పారు. నాలుగేళ్ల నుండి అతడు తన తల్లిని, మా అమ్మాయి అంటూ సంబోధించేవాడని, తొలుత పట్టించుకోలేదని చెప్పారు. మనోజ్ చనిపోయిన 13 రోజులకు ఆర్యన్ జన్మించాడు. దీంతోఅతడి మాటలు నిజమేనని నమ్ముతున్నారు.
నేను మళ్లీ పుట్టాను !
June 17, 2023
0
Tags