ఎల్ఐసీ బోనస్ పాయింట్ల పేరుతో నయా మోసం

Telugu Lo Computer
0


హైదరాబాద్ లో కొందరు సైబర్ నేరగాళ్లు ఎల్ఐసీ బోనస్ పాయింట్ల పేరుతో మోసానికి పాల్పడ్డారు. బోనస్ డబ్బులు వచ్చాయంటూ లింకులు పంపిస్తున్న సైబర్ నేరగాళ్లు లింకుల్ ఓపెన్ చేసిన ఖాతాదారుల డబ్బులు మాయం చేస్తున్నారు. స్థానిక భాషలో మాట్లాడి బురిడీ కొట్టించి, డబ్బులు అకౌంట్లో పడ్డాయంటూ లింకు ఓపెన్ చేయిస్తున్నారు. ఖాతాదారులు లింకు ఓపెన్ చేయడంతో బ్యాంకు ఖాతాలో డబ్బులు కొట్టేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో 100 పైగా ఎల్ఐసీ బోనస్ పాయింట్ల పేరుతో కేసులు నమోదయ్యాయి. దీంతో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టగా  ఢిల్లీ కేంద్రంగా ఈ మోసం జరుగుతోందని తెలుకున్నారు. రెండు ప్రత్యేక బృందాలను సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీకి పంపించి ఎంక్వైయిరీ చేయిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)