బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఆదిపురుష్ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. రామాయణ కథ కావడంతో ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే కార్తికేయ 2 నిర్మాత అభిషేక్ అగర్వాల్ తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు, అనాధ శరణాలయాలకు, వృధాశ్రమాలకు 10 వేల టికెట్స్ ని ఫ్రీగా డొనేట్ చేశారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ కూడా 10 వేల టికెట్స్ బుక్ చేసుకున్నాడు. నార్త్ లోని పలు ప్రాంతాల్లోని పేద పిల్లలకు ఈ టికెట్స్ ని డొనేట్ చేయబోతున్నాడు. ఆ శుగణాభిరాముడు కథ ఈతరం వాళ్ళకి కూడా తెలియాలని రణ్బీర్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. కాగా బాలీవుడ్ మరో వార్త కూడా బయటకి వచ్చింది. రణ్బీర్ కూడా రామాయణ కథలో నటించబోతున్నాడట. టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ సంపూర్ణ రామాయణాన్ని నిర్మించే పనిలో ఉన్న సంగతి మనకి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ లో రాముడిగా రణ్బీర్ నటించబోతున్నాడని తెలుస్తుంది. ఇక సీతగా అలియా భట్ కన్ఫార్మ్ అయ్యినట్లు సమాచారం. రావణాసురుడి పాత్ర కోసం కేజీఎఫ్ హీరో యశ్ ని సంప్రదిస్తున్నారట. దంగల్ తెరకెక్కించిన నితేశ్ తివారీ ఈ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయబోతున్నాడు. వచ్చే ఏడాది చివరిలో ఈ ప్రాజెక్ట్ మొదలు కానుందంటూ నితేశ్ ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో తెలియజేశాడు.
10 వేల ఆదిపురుష్ టికెట్స్ బుక్ చేసిన రణ్బీర్ !
June 08, 2023
0
Tags