పోలింగ్‌కు సర్వం సిద్ధం !

Telugu Lo Computer
0


కర్నాటకలో రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. 80ఏళ్ల పైబడిన వారు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే ఏర్పాట్లు కూడా ఈసీ చేసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా రంగంలోకి దిగుతుండగా.. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ మాత్రం తామే కింగ్ మేకర్లుగా నిలుస్తామనే ధీమాతో ఉంది. ఇక పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వస్తాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)