టీసీఎస్ కంపెనీకి బాంబు బెదిరింపు !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని మాదాపూర్‌ టీసీఎస్ కంపెనీలో బాంబు పెట్టినట్లు ఫోన్ కాల్ రావడంతో కంపెనీ యాజమాన్యం అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. టీసీఎస్‌కు చేరుకున్న పోలీసులు.. విస్తృతంగా తనిఖీలు నిర్వహించి బాంబు లేదని నిర్ధారించారు. అయితే బాంబు బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తి టీసీఎస్ కంపెనీ మాజీ ఉద్యోగిగా  పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. కంపెనీలో బాంబు లేదని తేల్చడంతో ఇటు ఉద్యోగులు, అటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)