పిడుగుపాటుకు ఒకరు మృతి

Telugu Lo Computer
0


తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో పిడుగు పడి ఒకరు మృతి చెందగా, నలుగురుకి గాయాలు అయ్యాయి. మండలంలోని భోజ్య నాయక్ తండాలో పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న క్రమంలో పిడుగు పడి బానోత్ సుమన్ చనిపోయాడు. బానోత్ భద్రు, అజ్మీరా శశిరేఖకు గాయాలయ్యాయి. మహేశ్వరం గ్రామానికి చెందిన లోడెం లింగయ్య రాములు నాయక్ తండా పరిధిలో వ్యవసాయ పనులు చేస్తుండగా పిడుగు పడి గాయాలయ్యాయి. క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. భాధితులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)