బీటెక్ విద్యార్థి హత్య

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక పంట పొలాల్లో జమ్ముల జీవన్ అనే బీటెక్ విద్యార్థి మృతదేహం గుర్తించారు. పెట్రోల్ పోసి తగలబెట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. విజయవాడ మాచవరం ప్రాంతానికి చెందిన జీవన్ పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం రాత్రి స్నేహితుడు శ్యాం పుట్టిన రోజు వేడుకల కోసం జీవన్ ఇంటి నుంచి వెళ్లాడని తెలుస్తోంది. బర్త్ డే పార్టీలో ఫోన్ రావటంతో వెళ్లాడని స్నేహితులు చెబుతున్నారు. పెట్రోల్ పోసి తగులబెట్టిన ఆనవాళ్లను బట్టి హత్య చేసి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)