అన్నను చంపిన తమ్ముడు !

Telugu Lo Computer
0


ఒడిశాలోని బలంగీర్ జిల్లాలో రింకు, శంకర్ భవానీ మెహర్ లు తల్లిదండ్రులతో కలిసి సలేపల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. మెహర్ తరుచుగా తల్లిదండ్రులను కొడుతుండేవాడు. కొద్ది రోజుల క్రితం కూడా తండ్రిని దారుణంగా కొట్టాడు​. దీంతో మెహర్​ తండ్రి తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి తిరిగొచ్చాడు. మే 13న​ ఆస్తమా సమస్యతో మరోసారి ఆసుపత్రిలో చేరాడు మెహర్ తండ్రి. దీంతో తండ్రి వద్దే ఉన్న రింకు మరుసటి రోజు ఇంటికి వచ్చాడు. అదే సమయంలో అన్నదమ్ములిద్దరికి మధ్య జరిగిన వాగ్వాదంలో రింకు​ను కొట్టాడు మెహర్. దీంతో తీవ్ర కోపానికి గురైన మెహర్​పై ఇనుప రాడ్​తో దాడి చేశాడు. ఈ ఘటనలో మెహర్​ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మెహర్​ మృతదేహాన్ని 8 ముక్కలుగా నరికి వాటిని బయట పడేసేందుకు బ్యాగుల్లో కుక్కాడు. కానీ వాటిని బయటవేసేందుకు నిందితుడికి వీలుకాలేదు. దీంతో అన్న శరీర భాగాలను అక్కడే విడిచిపెట్టి.. ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు రింకు. మే 17న ఇంటి నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం విచారణ జరిపి మృతుడి తమ్ముడే హత్యకు పాల్పడినట్లు నిర్ధారించుకుని అరెస్ట్​ చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)