ఢిల్లీలో రోహిణిలోని ఓ పాఠశాలలో ప్యూన్గా పనిచేస్తున్న 43 ఏళ్ల వ్యక్తిని నాలుగేళ్ల బాలికపై వేధింపులకు పాల్పడినందుకు గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన కుమార్తెపై వేధింపులకు పాల్పడినట్లు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. వేధింపులకు పాల్పడిన వ్యక్తికి మీసాలు ఉంటాయని కొన్ని గుర్తులను బాలిక పోలీసులకు చెప్పింది. బాలిక మే 1న పాఠశాలలో చేరింది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం చిన్నారి చెప్పిన ఆధారాలతో పోలీసులు స్కూల్ లో ప్యూన్ గా పనిచేస్తున్న సుల్తాన్పురికి చెందిన సునీల్కుమార్(43)ని అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354 బీ, పోక్సో చట్టం సెక్షన్ 10 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బాలికపై ప్యూన్ అఘాయిత్యం !
May 11, 2023
0
Tags