135 సీట్లు గెలిచినంత మాత్రాన నేనేమీ సంతోషంగా లేను !

Telugu Lo Computer
0


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన నేనేమీ హ్యాపీగా లేనని డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు.  బెంగళూరులో ఆయన కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. “మనకు అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లు దక్కాయి. అయితే నాలో సంతోషం లేదు. సిద్ధరామయ్య ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలిపేందుకు లేదా ఇతర పనులపై రావద్దు. మన తదుపరి లక్ష్యం లోక్‌సభ ఎన్నికలు. మనం శక్తిమేరకు పోరాడాలి” అని డీకే శివకుమార్ అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేయాలని చెప్పారు. పార్టీ శ్రేణులు క్షమశిక్షణతో ఉండాలని, ఈ కీలక సమయంలో సరైన వాటిపైనే దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. ప్రతి ఎన్నికల్లో గెలిచేందుకు కష్టపడి పనిచేయాలని చెప్పారు. కర్ణాటకలో గెలుపు ఆరంభం మాత్రమేనని, ఈ ఒక్క విజయాన్ని చూసుకుని బద్ధకంగా కూర్చోవద్దని అన్నారు. అయిదేళ్లు సమర్థవంతంగా పరిపాలన కొనసాగించాల్సి ఉందని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)