దిగ్భ్రాంతికి లోనయ్యా !

Telugu Lo Computer
0


కన్నడ స్టార్‌గా పేరున్న సుదీప్‌ బీజేపీకి మద్దతు ప్రకటించడంపై ప్రకాష్‌ రాజ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కిచ్చా సుదీప్‌ ప్రకటనతో దిగ్భ్రాంతికి గురయ్యా. ఎంతో బాధించింది అని ఓ జాతీయ మీడియాతో పేర్కొన్నారాయన. అంతకు ముందు కిచ్చా సుదీప్‌ బీజేపీలో చేరతారంటూ వచ్చిన కథనాలను ప్రకాష్‌ రాజ్‌ ఖండించారు. అది తప్పుడు వార్త అయ్యి ఉంటుందని బలంగా నమ్ముతున్నా. బీజేపీ ఓటమి భయంతోనే అలాంటి ప్రచారానికి దిగింది. అలాంటి ఉచ్చులో పడడానికి సుదీప్‌ అమాయకుడేం కాదంటూ ప్రకాష్‌ రాజ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. కానీ, ఆ అంచనాని తలకిందులు చేస్తూ బుధవారం బీజేపీకి సుదీప్‌ మద్దతు ప్రకటించారు. తాను రాజకీయాల్లో చేరబోనంటూనే.. రాబోయే ఎన్నికల్లో కేవలం బీజేపీ తరపున ప్రచారం చేస్తానని సుదీప్‌ చెప్పారు. సీఎం బసవరాజ్‌ బొమ్మై తనకు గాడ్‌ఫాదర్‌ లాంటి వాడని, ఆయన ఏ పార్టీలో ఉన్నా తాను ప్రచారం చేసేవాడినంటూ సుదీప్‌ నిన్న ఓ స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేశాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)