ఆనంద్ మహీంద్రా మెచ్చిన 'ఇడ్లీ' తయారీ !

Telugu Lo Computer
0


ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో ఇడ్లీల తయారీకి సంబంధించి షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కస్టమర్ల కోసం భారీ సంఖ్యలో ఇడ్లీలు వేస్తున్న వీడియో ఇది. ఇడ్లీ మౌల్డ్‌లో పిండి వేయడం, ఇడ్లీలు ఉడికాయో లేదో చెక్ చేయడం.. ఇలా ప్రతిదీ తనదైన శైలిలో వేగంగా చేశాడా వ్యక్తి. చివరకు అతడు తను వేసిన ఇడ్లీలను ఆవుకు కూడా పెట్టాడు. ఇదంతా వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా నెట్టింట షేర్ చేస్తూ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ''ఇళ్లల్లో ఆడవాళ్లు నెమ్మదిగా, శ్రద్ధగా ఇడ్లీలు వేయడం మనం చూశాం. మరోవైపు, వ్యాపారం చేసే వాళ్లు ఇలా భారీ స్థాయిలో ఇడ్లీలు సిద్ధం చేస్తుంటారు. ఇడ్లీలు సిద్ధం చేసే పద్ధతి ఏదైనప్పటికీ అందులో ఓ మానవీయకోణం, భారతీయత కొట్టొచ్చినట్టు కనబడుతుంది'' అంటూ ఆయన రాసుకొచ్చారు. ఇప్పటివరకూ ఈ వీడియోకు 9.9 లక్షల వ్యూస్ వచ్చా యి.

Post a Comment

0Comments

Post a Comment (0)