మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో 18 ఏళ్ల యువతి కోపంతో ఏకంగా ఫోన్ ని మింగేసింది. ఈ విషయం తెలుసుకున్న యువత బంధువులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి గ్వాలియర్కు రెఫర్ చేశారు. గ్వాలియర్కు వచ్చిన తర్వాత జిల్లా ఆస్పత్రిలోని వైద్యుల బృందం విజయవంతంగా ఆపరేషన్ చేసి బాలిక కడుపులో ఉన్న మొబైల్ను బయటకు తీశారు. గ్వాలియర్లోని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్కె ధాకడ్ దీనిపై మాట్లాడుతూ మొబైల్ యువతి కడుపులో ఉండిపోవడంతో యువతికి భరించలేని నొప్పి వచ్చిందని చెప్పారు. యువటికి అల్ట్రాసౌండ్, ఇతర పరీక్షలు నిర్వహించిన తరువాత ఆమె కడుపులో మొబైల్ ఫోన్ ఉందని తేలిందన్నారు. తర్వాత సర్జరీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ ప్రశాంత్ శ్రీవాస్తవ ఆధ్వర్యంలో వైద్యుల బృందం ఆపరేషన్ చేసి యువతి కడుపులో ఉన్న మొబైల్ ఫోన్ను విజయవంతంగా బయటకు తీశారన్నారు. దీంతో యువతికి నొప్పి నుంచి ఉపశమనం పొందింది.
కోపంతో మొబైల్ ను మింగిన యువతి !
April 06, 2023
0
Tags