ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే లీకేజీ కుట్రలు !

Telugu Lo Computer
0


తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో భట్టి విక్రమార్క పాదయాత్ర సాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు లీకేజీ కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి విద్యార్థుల జీవితాలతో నాటకమాడుతున్నాయన్నారు. తెలంగాణలో సింగరేణి కార్మికుల స్థితిగతులు మారలేదని, బిజెపి తెచ్చిన గనులు,ఖనిజాల బిల్లుకు బిఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు.కేంద్ర బిల్లుకు మద్దతు ఇచ్చారో లేదో బిఆర్ఎస్ నేతలు చెప్పాలని ఆయన అన్నారు. బీఆర్ఎస్ మద్దతు తోనే సింగరేణి ప్రైవేటికరణ జరుగుతుందని, బొగ్గు బ్లాకుల విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నాటకమాడుతున్నాయన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)