ఆర్టీసీ కళాభవన్ సీజ్ !

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళా భవన్‌ను సంస్థ ఆర్టీసీ సీజ్‌ చేసింది. సుచిరిండియా హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో ఉన్న అద్దె ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది. సుచిరిండియా 2016లో టీఎస్‌ఆర్టీసీకి చెందిన ఆర్టీసీ కళాభవన్‌ను అద్దెకు తీసుకుంది. కల్యాణ మండపం, కళా భవన్‌, మరో మూడు మినీ హాళ్లను లీజ్‌కు తీసుకుంటూ ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం నెలకు రూ. 25.16 లక్షలను టీఎస్‌ఆర్టీసీకి చెల్లించాలి. కొంతకాలంగా సుచిరిండియా సంస్థ అద్దె సకాలంలో చెల్లించడంలేదు. రూ..6.55 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. పెండింగ్‌ బకాయిలను చెల్లించాలని అధికారులు పలుమార్లు సంస్థకు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ వారినుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో కళాభవన్ ను అధికారులు సీజ్ చేశారు. సుచిరిండియాతో ఉన్న కాంట్రాక్టు ను రద్దుచేశారు. సంస్థ టీఎస్‌ఆర్టీసీకి అద్దె చెల్లించడం లేదు కాబట్టి.. కాంట్రాక్టును రద్దు చేసి ఆర్టీసీ కళా భవన్‌ను సీజ్‌ చేస్తున్నామని ప్రవేశ ద్వారం వద్ద ఒక పత్రాన్ని అధికారులు అతికించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)