నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై పిడుగు పడి మృతి !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ కార్మికుడిపై పిడుగు పడింది. దాంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ మాటలకందని విషాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రాపూర్ జిల్లా భద్రావతి తాలూకా మజ్రీ బొగ్గు గనిలో పని చేస్తున్న కార్మికుడు పని ప్రదేశం నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. అంతలో ఆకాశం నుంచి ప్రకాశవంతమైన మెరుపు అతనిపై పడింది. పిడుగు ధాటికి బాధిత కార్మికుడు.. స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు బీహార్ రాష్ట్ర వాసిగా గుర్తించారు. కాగా, పిడుగుపాటు దృశ్యాలు.. అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)