మైసూరులో మోడీ భారీ రోడ్‌షో ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 30 April 2023

మైసూరులో మోడీ భారీ రోడ్‌షో !


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తుది దశ ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల ప్రచారంలో భాగంగా రెండో రోజైన ఆదివారం సాయంత్రం మైసూరులో నిర్వహించిన భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు. దారిపొడవునా బీజేపీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఆయనకు స్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం తెలుపుతూ ప్రధాని ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనంలో ముందుకు కదిలారు. దారిపొడవునా బీజేపీ జెండాలు రెపరెపలు, నినాదాలు హోరెత్తగా, రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలు మోదీపై పూలవర్షం కురిపించారు. ప్రధాని వెంట బీజేపీ మాజీ నేత కేఎస్ ఈశ్వరప్ప కూడా పాల్గొన్నారు. దీనికి ముందు, కోలార్‌లో జరిగిన భారీ సభలో మోదీ పాల్గొన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం బీజేపీని గెలిపించాలని, కాంగ్రెస్, జేడీయూను దూరంగా ఉంచాలని, రాష్ట్రంలో అస్థిర ప్రభుత్వం ఏర్పడితే అభివృద్ధి తిరోగమనం పడుతుందని అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం కర్ణాటకలో మళ్లీ అధికారం చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

No comments:

Post a Comment